రిపోర్టర్: FutureAndhra News Desk  |  వర్గం: క్రీడలు

ఒకేసారి రెండు దేశాలతో పోటీకి టీమ్ ఇండియా! భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది.

క్రికెట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే వార్త! భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఒకేసారి రెండు వేర్వేరు దేశాలతో టీమ్ ఇండియా పోటీ పడనుంది. అంటే, రెండు వేర్వేరు భారత జట్లు ఒకేసారి అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరంగేట్రం చేయనున్నాయి. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం.

ఐపీఎల్‌లో ప్రతిభ చూపిస్తున్న ఎందరో యువ క్రికెటర్లకు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటే అవకాశం దొరకనుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ సంచలనాలకు అంతర్జాతీయ అనుభవం కల్పించాలనేది బీసీసీఐ లక్ష్యం. ఆసియా క్రీడలు, వెస్టిండీస్ పర్యటన వంటివి ఒకే సమయంలో వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ ప్రణాళికను బీసీసీఐ సిద్ధం చేసింది.

ఈ వ్యూహం వల్ల భారత జట్టు బెంచ్ బలం మరింత పెరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు రెండో జట్టుకు సారథ్యం వహించే అవకాశాలున్నాయి. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి ఐపీఎల్ స్టార్లకు ఇది నిజంగా ఒక వరం.

Tags: indian cricket team, BCCI master plan, cricket news, asian games cricket, west indies tour, young cricketers, ipl talents, indian cricket schedule