దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా పురోగమిస్తున్నాయి. వచ్చే వారం నాటికి దేశం మొత్తం రుతుపవనాల ప్రభావంలోకి రానున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. ప్రస్తుతం రెండు వేర్వేరు వాతావరణ వ్యవస్థల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

కాగా, నిన్న జూన్ 30న వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లుల హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు వాయువ్య భారతదేశంపై దృష్టి సారించాయి. మరోవైపు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతుండగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం వర్షాల కోసం ఎదురుచూస్తోంది. ఉపగ్రహ డేటా ప్రకారం, రుతుపవనాలు తిరిగి పుంజుకున్న ప్రాంతాల్లో 1,500 కిలోమీటర్ల మేర వర్షపు మేఘాలు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది.

Photo: Md Nadim Mahmud / Pexels