బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇదంతా హనీట్రాప్ అని ఒక వర్గం అంటుంటే, యూట్యూబర్ దొర సాయితేజ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
టాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలను మించిపోయేలా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే, ఇది పక్కా హనీట్రాప్ అని, ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ్ ఫిర్యాదు చేయడం కథలో ఊహించని ట్విస్ట్. ఈ డ్రామా వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రస్తుతం భగీరథ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉండటం సస్పెన్స్ను మరింత పెంచుతోంది. ఈ హై-ప్రొఫైల్ కేసును సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్తో మాట్లాడి ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. ఓవైపు పోలీసుల వేట కొనసాగుతుండగానే, ప్రధాని మోదీ టూర్ ముందు ఈ కేసు బయటకు రావడం వెనుక భారీ రాజకీయ కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నెక్స్ట్ సీన్ ఏంటనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
ఈ సున్నితమైన ఇష్యూలోకి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ దొర సాయితేజ ఎంట్రీ ఇవ్వడంతో నెట్టింట మంటలు చెలరేగాయి. నిందితుడిని వెనకేసుకొస్తూ సాయితేజ చేసిన వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వ్యూస్ కోసం, కాసుల కోసం మైనర్ బాలికకు అన్యాయం జరిగేలా మాట్లాడటం సిగ్గుచేటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. పక్కా పెయిడ్ వీడియో అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. పోక్సో చట్టాన్ని అపహాస్యం చేయొద్దని హెచ్చరిస్తూ నెటిజన్లు ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.