2027 వరల్డ్ కప్ పై గుంభన వీడింది. గంభీర్, అగర్కర్ మాస్టర్ ప్లాన్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కు బైబై చెప్పేశారు.
2027 వరల్డ్ కప్ కోసం భారత జట్టుపై ఇప్పుడు దృష్టి! దక్షిణాఫ్రికా పిచ్లపై వేగం, బౌన్స్ ఉంటాయి. గంభీర్, అగర్కర్ వ్యూహాలు జట్టు కూర్పును మార్చనున్నాయి. అనుభవం, ఆవేశం కలగలిసిన జట్టు కోసం కసరత్తులు మొదలయ్యాయి. రోహిత్, కోహ్లీలకు ఇది చివరి అవకాశం కావచ్చు. వారిద్దరూ ఘనంగా ముగించాలని చూస్తున్నారు.
శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో కోహ్లీ. అయ్యర్, రాహుల్ మధ్య ఓవర్లు నిర్మిస్తారు. రాహుల్ వికెట్ కీపింగ్ అదనపు బలం. హార్దిక్ పాండ్యా ఫినిషర్, నాలుగో పేసర్గా కీలకం. అక్షర్ పటేల్ స్పిన్, బ్యాటింగ్ లో మెరుస్తాడు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు చూస్తారు. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్.
జైస్వాల్, జడేజా, సుందర్ వంటి ప్లేయర్స్ కి చోటు కష్టమే. రోహిత్-గిల్ ఓపెనింగ్, అక్షర్ ఫామ్ కారణంగా వీరిద్దరూ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ మార్పులు జట్టు బలాన్ని ఎలా పెంచుతాయో చూడాలి.