ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్, విజయ్ విజయాలను ప్రస్తావిస్తూ చేసిన ఈ ట్వీట్ వార్ నెట్టింట పెను దుమారం రేపుతోంది.

టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఒక ఊహించని ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎప్పుడూ #JustAsking అంటూ ప్రధాని మోదీపై, బీజేపీపై విమర్శలు గుప్పించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ డైరెక్టర్, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఆయనపై సోషల్ మీడియాలో ఓపెన్ ఛాలెంజ్ విసరడం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడని స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ, దమ్ముంటే అన్‌బ్లాక్ చేసి చర్చకు రావాలని శ్రీధర్ విసిరిన సవాల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మధుర శ్రీధర్ తన ట్వీట్‌లో ప్రకాష్ రాజ్ ఇగోను గట్టిగానే టార్గెట్ చేశారు. నువ్వు విమర్శించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారని, దళపతి విజయ్ సీఎం కాబోతున్నారని గుర్తుచేశారు. కానీ నువ్వు మాత్రం చిన్న 'మా' ఎలక్షన్స్ లో కూడా గెలవలేకపోయావని, కర్ణాటకలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్‌ను కపట లౌకికవాదిగా, అసలైన హేట్ మాంగర్‌గా అభివర్ణిస్తూ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ ఊహించని ట్వీట్ తర్వాత నెట్టింట మెగా అభిమానులు, నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ప్రకాష్ రాజ్ భావప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు మధుర శ్రీధర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోల రాజకీయ విజయాలను ప్రస్తావిస్తూ శ్రీధర్ వేసిన సెటైర్లకు ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ నటుడు సైలెంట్‌గా ఉంటారా, లేక తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags: prakash raj twitter war, madhura sreedhar reddy comments, tollywood latest gossip, pawan kalyan vs prakash raj, maa elections tollywood, prakash raj bjp comments, futureandhra entertainment news