15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా, కమిన్స్ను చితక్కొట్టి IPLలో హాట్ టాపిక్! రాజస్థాన్ రాయల్స్ డైమండ్ పై దిగ్గజాల కన్ను.. రూ.30 కోట్లు దాటనుందా?
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ IPL వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు! బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఉతికి ఆరేస్తున్న ఈ యువ సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. రాజస్థాన్ రాయల్స్ సొంతమైన ఈ అద్భుత వజ్రంపై ఇప్పుడు దిగ్గజ జట్ల కన్ను పడింది.
ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ వంటి భారీ జట్లు వైభవ్ కోసం గాలం వేసే అవకాశం ఉందని, రాజస్థాన్ రాయల్స్ అతన్ని కాపాడుకోవడం అంత సులువు కాదని హెచ్చరించారు. వేలంలోకి వస్తే రూ.30 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదన్నారు. జోస్ బట్లర్ సైతం వైభవ్ ఆటతీరును మెచ్చుకుంటూ, క్రిస్ గేల్, సెహ్వాగ్ లతో పోల్చాడు.
ఒకప్పుడు 1.1 కోట్లకు కొనుగోలు చేసిన వైభవ్, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కు వందల కోట్ల విలువను తెచ్చిపెడుతున్నాడు. గతేడాది డకౌట్ అయినా, మరుసటి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగడం అతని మానసిక దృఢత్వానికి నిదర్శనం. ఈ వండర్ కిడ్ కోసం రాజస్థాన్, ముంబై మధ్య భవిష్యత్తులో గట్టి పోటీ తప్పదు.